పోస్టులు అభిప్రాయాలు 15 March 2010

సభలు-సమావేశాలు సెప్టెంబర్ 2007

“ఎన్నాద్రి” ఆవిష్కరణ

ప్రముఖ కవి డాక్టర్‌ కాసుల లింగారెడ్డి రచించిన “ఎన్నాద్రి” కవితా సంకలనాన్ని హైదరాబాద్‌లోని బషీర్‌బాగు ప్రెస్‌ క్లబ్‌లో జూలై 7,2007 రాత్రి వరవరరావు ఆవిష్కరించారు. మొత్తం చదవండి »

సభలు-సమావేశాలు సెప్టెంబర్ 2007

అందరినోట … అదే మాట తెలంగాణ

జాతీయ సదస్సులో వెల్లివిరిసిన చైతన్యం - ప్రత్యేక రాష్ట్రంపై సాహితీ పోరు

‘జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం… ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం” అంటూ అందెశ్రీ ఆలపించిన ప్రారంభ గీతం జూలై 19న భువనగిరిలో జరిగిన తెలంగాణ సాహిత్య సదస్సుకు సరికొత్త ఉత్సాహోన్ని ఇచ్చింది. దశాబ్దాలుగా వివక్షకు గురవుతున్న ఈ ప్రాంత సాహిత్య కళారూపాలను ప్రజల చెంత చేర్చాలనే తలంపుతో ‘తెలంగాణ సాహిత్యం- జీవిత చిత్రణం పేరిట ఏర్పాటు చేసిన జాతీయ సదస్సు తెలంగాణ అభిమానుల గుండెలను హత్తుకుంది. మొత్తం చదవండి »

సభలు-సమావేశాలు సెప్టెంబర్ 2007

సాహితీ చరిత్రలో ఆదిలాబాద్‌ జిల్లాకు అన్యాయం

సాహితీ చరిత్రలో ఆదిలాబాద్‌ జిల్లాకు తీరని అన్యాయం జరిగిందని ప్రముఖ రచయిత, ప్రాచీన లిఖిత గ్రంథాల పరిశోదనాలయ సంస్థ డైరక్టర్‌ ప్రొఫెసర్‌ జయదీర్‌ తిరుమలరావు అభిప్రాయపడ్డారు. సెప్టెంబర్‌ 7న నిర్మల్‌లో మునిపంతులు రచించిన గోండిభారతం పుస్తక సంకలనాన్ని తిరుమలరావుతో బాటు ప్రముఖ సిని డైరక్టర్‌, మాభూమి ఫేమ్‌ బి.నర్సింగరావులు ఆవిష్కరించారు. మొత్తం చదవండి »

సభలు-సమావేశాలు సెప్టెంబర్ 2007

తెలంగాణ కవిత - 2007 ఆవిష్కరణ

తెలంగాణ కవుల నిరసన, ధిక్కారం, ఆగ్రహం, ఆవేదన, గోసలతో కూడిన ఆత్మగల్ల కవిత్వం “తెలంగాణ రాష్ట్ర అవతరణని బలంగా కాంక్షిస్తున్న ‘ఓ అవ్వ’ చేతుల మీదుగా తెలంగాణ విమోచన దినోత్సవం రోజున ఆదిలాబాద్‌ స్థానిక అమరవీరుల స్థూపం వద్ద యువకవి వేణుగోపాల్‌ రెడ్డి నినాదాల మధ్య ఆవిష్కరణ జరిగింది. మొత్తం చదవండి »

సభలు-సమావేశాలు సెప్టెంబర్ 2007

తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన తెలంగాణా కవితా వైతాళికులు

“తెలుగు సాహిత్యం గర్వించదగిన ఎందరో మహా కవులనూ, రచయితలనూ, తెలంగాణ సాహిత్యం సృష్టించుకున్నది. మట్టి మనషులు ఇక్కడ చైతన్యంతో మహా కవులుగా రూపొందారు. సామాన్యులు మాన్యులైన మహారచయితలుగా సాహిత్యాన్ని సృష్టించారు. మఖ్దుం, దాశరధి, కాళోజి, వానమాములై, సుద్దాల హనుమంతు, సి. నారాయణ రెడ్డి తదితర కవితా వైతాళికులను స్మరించటం స్ఫూర్తిదాయకం” అంటూ పలువురు వక్తలు విశ్లేషించారు. మొత్తం చదవండి »

సభలు-సమావేశాలు సెప్టెంబర్ 2007

పెండ్యాల రాఘవరావు “నా ప్రజాజీవితం” పుస్తకావిష్కరణ సభ

ప్రజల కోసం జీవించి వారి బాధలను తమ బాధలుగా భావించి ప్రజా పోరాటం చేసిన మహానీయుల ఆదర్శమే స్వచ్చమైన ప్రజాస్వామ్యానికి పునాదిగా పలువురు వక్తలు అభివర్ణించారు. స్వాతంత్య్ర యోధుడు పెండ్యాల రాఘవరావు 20వ వర్ధంతిని పురస్కరించుకొని సెప్టెంబర్‌ 10న ఆయన ఆత్మకథ ‘నా ప్రజా జీవితం’ పుస్తకావిష్కరణ వరంగల్‌ జిల్లా పరిషత్‌ హాల్‌లో జరిగింది. మొత్తం చదవండి »

సభలు-సమావేశాలు సెప్టెంబర్ 2007

వీరయోధుల స్ఫూర్తితో సామ్రాజ్యవాదాన్ని అంతం చేయాలి

నాటి స్వాతంత్య్ర పోరాట వీరయోధులను స్ఫూర్తిగా తీసుకొని సామ్రాజ్యవాదాన్ని అంతం చేయటానికి ఉద్యమిరచాలని విరసం నాయకులు వరవరరావు పిలుపునిచ్చారు. జూలై 17న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ హస్టరీ సోసైటీ అధ్వర్యంలో లోకేశ్వర్‌ రాసిన “1857 హైదరాబాద్‌ తిరుగుబాటు గాథలు” పుస్తకావిష్కరణ జరిగింది. మొత్తం చదవండి »

స్పందన సెప్టెంబర్ 2007

స్పందన : జూలై - సెప్టెంబర్‌, 2007

బి.వి.ఎన్‌. స్వామి గారు ఎంతో కష్టపడి ఎన్నో రచనల/పుస్తకాల పేర్లు, రచయితల విశిష్టతలు మరియు విశిష్ట రచనలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు మరియు అభినందనలు.

ఇటీవలి తెలంగాణ ఉద్యమం మొదలైన తరువాత తెలంగాణకు ఆంధ్రోల్లు (పెత్తనాలు చేసిన) చేసిన అన్యాయాల పైన ఎన్నో పుస్తకాలు వచ్చాయి. ఎంతో సాహిత్యం వచ్చింది. మొత్తం చదవండి »

సంపాదకీయం జూన్ 2007

బహుపరాక్‌

- డా|| నందిని సిధారెడ్డి

రెండు నదుల మధ్య నివసిస్తున్న ప్రజలకు రెండుపూటల తిండి దొరుకుతలేదు. కనీసం తాగెతందుకు నీళ్లు కరువవుడు నిజంగా విషాదం. నీటి వనరు కోసం నిత్య సంఘర్షణ నేటి కఠోర వాస్తవం. భూమినీ నీటినీ ఎడబాపుతున్న వలసాంధ్రుల పెడబుద్ధులు లెక్కించతరం గాదు. పూటకో వ్యూహం రోజుకో పథకంతో వెనుకబడిన జనాన్ని వేపుక తింటున్న రాకాసిపీడ నిలువరించ తరం గాదు. కొత్తగా గోదావరి నీళ్లు కృష్ణా నదిల కలిపి ఆంధ్రాకు తరలించేటందుకు ప్రణాళికలు రచించిండ్రు. మొత్తం చదవండి »

వ్యాసాలు జూన్ 2007

ఉత్తర తెలంగాణ కథకుల పరిచయం - 1

- బి.ఎన్‌.స్వామి

కథలు, కవితలు అనేకం వస్తున్నాయి. సాహిత్యం సంపద్వంతం అవుతున్నది. అనేక దృక్ఫధాలతో వెలువడుతున్న సాహిత్యం అనేక రకాలుగా పదిలపరచబడుచున్నది. ఒకచోట నిక్షిప్తం కానిది అనేకం ఉంది. అదంతా పాఠకులకు చేరాలి. అనేకులు కథలు రాస్తున్నారు. ఎవరెవరు ఏమి రాస్తున్నారు? ఎంతమంది రాస్తున్నారు? అనే లెక్క తేలియాలి. లెక్క తెలుసుకునే క్రమంలోనే చరిత్ర నిర్మాణం జరుగుతది. సమాజం అనేక అస్థిత్వాల మధ్య ముక్కలు ముక్కలుగా కొనసాగుతుంది. మొత్తం చదవండి »

« Previous PageNext Page »